నాసా_పోటీలకు_ సమాయత్తమవుతున్న....అమలాపురం రవీంద్రభారతి విద్యార్థులు      

 .


.అమలాపురం ;నేషనల్ ఏరోనాటిక్స్ మరియు స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)  లో దక్షిణ భారతావని లోనే ప్రప్రథమంగా 2009  వ సంవత్సరం లో మొదలైన రవీంద్రభారతి విద్యాసంస్థల ప్రస్థానం గత 11 సంవత్సరాలుగా,రవీంద్రభారతి విద్యాసంస్థల ప్రణాళికా రచన, విధివిధానాలు, క్రమశిక్షణలనే ఆయుధాలు గా మలచి ప్రతీ సంవత్సరము విజయబావుటా ఎగురవేస్తూ రవీంద్రభారతి కి సాటి-ఏ సంస్థా కాదు పోటీ అంటూ వివిధ  అంశాలలో విజయదుందుభి మోగిస్తున్న ఏకైక విద్యా సంస్థ రవీంద్రభారతి మాత్రమే అని పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతీ  సంవత్సరము వలె ఈ విద్యా సంవత్సరము నకు కూడా షెరటాన్ గేట్ వే, లాస్ ఏంజెల్స్ లో 2021 వ సంవత్సరము మే నెల 27 నుండి 30 తేదీల వరకు జరిగే అంతర్జాతీయ  సమ్మేళనము నకు రవీంద్రభారతి విద్యార్థులు  నూతన ఉత్సాహముతో, ఉత్తేజముతో, ఉత్సుకతతో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి వివిధ శాఖలలో, వివిధ అంశాలలో అలహర్ట్జ్ , ఆధ్య, తేజేష్ ,హాఫ్ నంగ్ , టెక్నిథి-జి ప్రాజెక్టుల తో సంసిద్ధమయ్యారు.రవీంద్రభారతి విద్యాసంస్థల ఛైర్మన్ ఎం.యస్.మణి విద్యార్థులను ప్రోత్సహిస్తూ,విజేతలై, జగజ్జేతలై పోటీలో నిలవాలని ఆకాంక్షిస్తూ,ఆశీర్వదిస్తూ  వారికి శుభ వచనాలను,సూచనలను తెలియజేసారు.ఇలాంటి మరెన్నో విజయాలను సాధించి రవీంద్రభారతి విద్యాసంస్థల కీర్తిప్రతిష్టలను మరింత ఇనుమడింప జేసేలా విద్యార్థులందరు తయారుకావాలని పలువురు ఆకాంక్షిస్తూ, వారి ఆశీర్వచనాలు అందజేశారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు