ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో కరోనా సోకిన గర్భిణీ స్త్రీలను జాప్యం లేకుండా జాయిన్ చేసుకోవాలి
తూర్పుగోదావరి ;ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో కరోనా సోకిన గర్భిణీ స్త్రీలను జాప్యం లేకుండా జాయిన్ చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (డబ్ల్యూ) జి.రాజకుమారి సబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కోవిడ్ వార్డులను జెసి జి.రాజకుమారి, టెనీ కలెక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కరోనా సోకిన గర్భిణీ స్త్రీలను మొదటి ప్రాధాన్యతగా భావించి వచ్చిన వెంటనే జాయిన్ చేసుకోవాలన్నారు. అదే విధంగా హెల్ప్ డెస్క్ బోర్డులను అందరికి కన్పించే విధంగా పెద్దవి పెట్టాలని ఆమె ఆదేశించారు. అనంతరం జెసి జి.రాజకుమారి కోవిడ్ వార్డు వద్ద జరుగుతున్న ఓ.పి ప్రక్రియను పరిశీలించి అక్కడవున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేసారు. ఈ పరిశీలనలో జెసి వెంబడి సి.పి.ఓ కెవికె రత్నబాబు, డా.బి.సత్యసుశీల, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి