పెండింగ్ నిధులు విడుదల చేయండి కేంద్ర మంత్రులతో బుగ్గన వరుస భేటీలు..ఢిల్లీలో కీలక పరిణామాలు..

                                                                అమరావతి, అక్షర లీడర్ ప్రధాన ప్రతినిధి;ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణలు కేంద్రానికి ఇచ్చామన్నారు. రూ. 3,500 కోట్లు రీయంబర్స్మెంట్ చేయాల్సి ఉందని, పోలవరం త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ఖర్చు పెట్టి రీయింబర్స్మెంట్ అడుగుతోందని వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టం ప్రకారం రెవెన్యూ లోటు నిధులతో కొత్త ప్రాజెక్టులకు ఉపయోగిస్తామని తెలిపారు. జీఎస్టీ బకాయిలు రాష్ట్రానికి రూ. 3,500 కోట్లు రావాల్సి ఉందని బుగ్గన వెల్లడించారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రాష్ట్రానికి 40 శాతం ఆదాయం పడిపోయిందని, కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి పోలవరం నిధులను విడుదల | చేయాలని అడుగుతామని మంత్రి బుగ్గన చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను వదిలిపెట్టి ప్యాకేజీకి మార్చుకుందని, ప్యాకేజీలో స్పష్టత లేక ఈఏవీ నిధులు అంటూ అయోమయాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సైతం మంత్రి బుగ్గన భేటీ అయ్యా రు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురా గ్ ఠాకూర్, నీతి ఆయోగ్ అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్ కలవనున్నారు. బుగ్గన వెంట ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లా 0, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్ మీడియాతో మాట్లాడు న్యూఢిల్లీ తూ.. పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాం తాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి దేశ్ విభజన చట్టంలోని అభివృద్ధి | పథకాలకు నిధులు, పీడీఎస్, జీఎస్టీ బకాయిల మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి డానట్లు తెలిపారు. రాష్ట్రానికి చేయూత ఇచ్చేం దుకు అదనంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు