నాడు-నేడు పనులు వేగవంతం చేయండి

తూర్పుగోదావరి ;;జిల్లాలో నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలక్టర్ కార్యాలయంలో కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధ్యక్షతన నాడు-నేడు, సామాన్య ప్రజలకు ఇసుక సరఫరా లో ఎదురౌతున్న సమస్యలు, నివారణ చర్యలు, సిమెంట్, సిరామిక్ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణపనుల పై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. కాబట్టి ప్రాధాన్యత అంశాలు అనుగుణంగా నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత ఎమ్ ఇఓలు, హెచ్ఎమ్ లు నిర్లక్ష్యం విడిచి పెట్టి తిరిగి పాఠశాలలు పారంభించే నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అలక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని కలక్టర్ తెలిపారు. అదే విధంగా పాఠశాలల్లో జరిగిన నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా సరఫరా చేయాలన్నారు. ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటు సామాన్య ప్రజలకు, నాడు-నేడు కార్యక్రమంలో చేపట్టే నిర్మాణ పనులు మినహ, ప్రభుత్వ, ప్రైవేట్ ఇసుక బల్క్ ఆర్డర్లు నిలిపి వేయాలని జిల్లా ఇసుక అధికారినికి కలక్టర్ సూచించారు. ఇసుక ర్యాంక్స్ వద్ద సిసి కెమెరాలు, వెయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేసే విధంగా చూడాలన్నారు. ఇసుక డిపోలకు చుట్టూ పెన్సింగ్ వేయాలని జిల్లా ఇసుక అధికారికి కలక్టర్ సూచించారు. అదే విధంగా నాడు-నేడు నిర్మాణపనుల్లో భాగంగా సిమ్మెంట్ సరఫరా చేసే వారి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినందున పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ వీలు లేదని కలక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జెసి(ఆర్) జి.లక్ష్మీశ, జెసి(డి) కీర్తి చేకూరి, కాకినాడ నగర్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జెసి(డబ్ల్యూ ) జి.రాజకుమారి, ఎస్.ఇ బి అడిషనల్ ఎస్.పి సుమిత్ గరుడ, డిఇఓ ఎస్ అబ్రహం, పిఓ ఎస్ఎస్ఎ బి.విజయ్ కుమార్, పరిశ్రమల శాఖ జి.ఎమ్ బి.శ్రీనివాస్, ఎస్.ఇ ఆర్ డబ్ల్యుఎస్ గాయిత్రిదేవి, ఎస్.ఇ పంచాయితీ రాజ్ నాగరాజు, జిల్లా ఇసుక అధికారి బి.రవికుమార్, ఎడి మైన్స్ డివిఆర్ కుమార్, కెసిపి, పెన్నా, భవ్య సిమెంట కం పెనీ ప్రతినిధులు, రాక్ సిరామిక్, అపర్ణ కం పెనీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు