
దేశవ్యాప్తంగా మరో రెండు వారాలు లాక్డౌన్ పొడిగించింది కేంద్రం. మే 17 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ జోన్ల పరిధిలో పూర్తి స్థాయిలో ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అక్కడ యథాతధంగా లాక్డౌన్ కొనసాగుతుందని ఉత్తర్వులో పేర్కొంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లనో మాత్రం కొంత వరకు ఆంక్షలను సడలిస్తారు. అప్పటి వరకు విమానాలు, మెట్రో, రైళ్లు ప్రయాణాలపై నిషేధం ఉంటుందని పేర్కొంది. స్కూళ్లు, ఆఫీసులు, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, జిమ్స్, సినిమా హాళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇది అన్ని జోన్లకూ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి