గ్రేట్ సీఎం జగన్ ;;జగన్ ముందు జాగ్రత్త చర్యలు
ఇతర రాష్ట్రాల నుంచీ విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో పెట్టడానికి వీలుగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ సన్నద్దం అవుతున్నారు. గ్రామ సచివాలయాలను ఇప్పుడు వాడుకోవటానికి రెడీ అవుతున్నారు.
ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని పేర్కొన్నారు. భోజనం, సదుపాయాలు, బెడ్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా పరిస్థితుల కారణంగా వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకుపోయిన వారు తిరిగి వస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధానంపై సమావేశంలో చర్చ జరిగింది.కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని సీఎం ఆదేశించారు.
అంగన్వాడీలు, మెప్మా, పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో కరోనా క్వారంటైన్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్ వాహనాలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇదే సమయంలో కుదిరినంత వరకు ఫ్రీజర్లు ఏర్పాటుచేసి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు, లాంటి నిత్యావసరాలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. చాలావరకు కేంద్రంలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయాలనే అనుసరిస్తున్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి