జి . మామిడాడ ;కరోన విజృంభణ ;;...ప్రశాంత గ్రామంలో భయాందోళనలు .. మండలం నుండి మరో మండలానికి ... కరోనా పాజిటివ్ కేసులు 19
- పెదపూడి,(తూర్పు గోదావరి ): కరోనా మహమ్మారి ప్రశాంతంగా ఉన్న గొల్లలమామిడాడ గ్రామాన్ని ఒక్కసారిగా చుట్టుముట్టింది. కరోనా సోకి ఒక వ్యక్తి మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళనలతో కరోనా టెస్టులకోసం ఎగబడ్డారు.ఇప్పటికే శుక్రవారం 8 మందికి నిర్దారణ కాగా శనివారం 213 మందికి పరీక్షలు నిర్వహించగా 19 మందికి కరోనా వైరస్ సోకింది వీరిలో 13 మంది మామిడాడకు చెందిన వారు కాగా 6గురు బిక్కవోలు కు చెందిన వారు .. ఇదిలా ఉండగా కంటోన్మెంటు జోన్ గా ప్రకటించిన మామిడాడ బసివిరెడ్డి పేటకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా శనివారం పరీక్షలు చేయించుకుంటున్నారు.
...కంటోన్మెంటు జోన్ లను పరిశీలించిన ఎస్పీ, డీఎస్పీ
గొల్లలమామిడాడ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటోన్మెంటు జోన్ లు, రెడ్ జోన్ లను జిల్లా ఎస్పీ నయీం అస్మీ, డీఎస్పీ భీమారావులు పరిశీలించారు. భద్రత కట్టుదిట్టం చెయ్యాలని, గ్రామం నుంచి ఎవరు బయటకు వెళ్ళకుండా, గ్రామంలోకి ఎవరు రాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. లాక్ డౌన్ ఏర్పాట్లుపై కాకినాడ రూరల్ సిఐ మురళీ కృష్ణ, ఎంపీడీవో విజయభాస్కర్, తహశీల్దార్ రాజ్యలక్ష్మీలను అడిగి తెలుసుకున్నారు. రెడ్ జోన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి