గబ్బిలాలను మన దేశంలో కూడాతింటారు ...ఎక్కడో తెలుసా /...
సామూహిక పండుగ
స్త్రీ, పురుషులు సమానంగా, సామూహికంగా గబ్బిలాల పండుగను జరుపుకుంటారు. భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలను పరిశీలిస్తే నాగాలాండ్ లోని ఓ చిన్న గ్రామంలో జరిగే ఈ గబ్బిలాల పండుగ ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రజలు చాలా దూర ప్రాంతాల నుండి కూడా ఈ పండుగను చూసేందుకు వస్తుంటారు. నాగాలాండ్ మరియు సమీప పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు అక్టోబర్ నెల వచ్చిందంటే మిమి గ్రామానికి వెళ్ళేందుకు ఆసక్తి చూపిస్తారు.నాగాలాండ్ రాజధాని కోహిమా ఒక ముఖ్యమైన హిల్ స్టేషన్. దీనిని మొదట్లో కెవిరా అని పిలిచేవారు. తరువాత బ్రిటిష్ వారు దీనిని కోహిమాగా పేరు మార్చారు.
ప్రకృతిని ఆస్వాదించడానికి భారత దేశంలోని ఉత్తమమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఈ ప్రదేశం కొండలు, లోయలతో గొప్ప ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది. సాహసాలను ఇష్టపడే వారి కోసం ట్రెక్కింగ్, క్యాంపింగ్, హైకింగ్ వంటి ఆసక్తికరమైన కార్యకలాపాలు ఇక్కడ ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో కోహిమా ప్రసిద్ధి చెందింది. యుద్ధంలో మరణించిన వేలాది మంది సైనికులను ఇక్కడ కామన్వెల్త్ యుద్ధ స్మశానవాటికలో ఖననం చేశారు. అంతే కాదు ఇక్కడ అనేక మ్యూజియంలు, జంతు ప్రదర్శనశాలలు, అభయారణ్యాలు, లోయలు, స్వయం ప్రతిపత్త గ్రామాలు ఉన్నాయి.
నాగాలాండ్ రాష్ట్రంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం దిమాపూర్. నాగాలాండ్ సందర్శనకు వచ్చే టూరిస్టులు ఖచ్చితంగా ఈ నగరంలో పర్యటిస్తారు. ఎందుకంటే ఇక్కడే విమానాశ్రయం ఉంది. ట్రిపుల్ ఫాల్స్, కచారి, నాగాలాండ్ సైన్స్ సెంటర్, జూలాజికల్ పార్క్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ధన్సిరీ నది నగరం యొక్క తూర్పు భాగం గుండా ప్రవహిస్తుంది. పశ్చిమ భాగంలో ఎక్కువగా అడవులు మరియు కొండలు ఉంటాయి. టూరిస్టులు ఇక్కడ ఒక రోజు గడిపి నగరాన్ని అన్వేషించి తదుపరి ప్రదేశాల పర్యటనలను వెళ్లవచ్చు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి