కూలీలు ,కుష్ఠు రోగులకు పోలీసుదళం అన్నదానం
తూర్పు గోదావరి జిల్లా రిజర్వు పోలీస్ దళం నందు పనిచేయుచున్న ఏ. ఆర్. ఆఫీసర్స్ & మెన్ COVID-19 సందర్భంగా జిల్లాలో "లాక్ డౌన్" కారణంగా ఆహారం కొరకు అవస్థలు పడుతున్న వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న దినసరి కూలీలు మరియు కుష్టు రోగులకు అన్నదానం నిర్వహించారు.
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయం అస్మి , అడిషనల్ ఎస్పీ (ఆపేరేషన్స్ ) ఆరిఫ్ హాఫిజ్ , అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) కె . కుమార్, అడిషనల్ ఎస్పీ ఏ ఆర్ .ఎస్. ప్రభాకర రావు , డీస్పీ ఏఆర్ ఎస్ వి అప్పారావు ,ఎసిబి డీస్పీ లు ఎం. అంబికా ప్రసాద్, ఎస్. మురళి మోహన్, ఎసిబి సిఐ ఎస్ . రాంబాబు మరియు ఆర్ ఐ ,ఎఆర్ పి ఈశ్వరరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసి పోలీస్ శాఖ నుండి వారి యొక్క సేవా దృక్పథం తెలియపరచు కున్నారు మొత్తంగా 500 మందికి ఈరోజు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లను అందజేయడం జరిగింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి