ఆ ... దేవుడు వారిని చల్లగా చూడాలి ;ప్రిన్స్ మహేష్ బాబు

‘‘రెండు వారాల లాక్‌డౌన్.. మనం శక్తివంతమవుతున్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు ఐక్యంగా చేపట్టిన ప్రయత్నాలను కచ్చితంగా మెచ్చుకోవాలి. కోవిడ్-19పై మనం చేస్తోన్న యుద్ధంలో ముందు వరుసలో నిలబడిన వారందరికీ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు కృతజ్ఞతలు చెప్పుకుందాం.నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురష్కరించుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ క్లిష్ట సమయంలో వైద్య సిబ్బంది సేవను ఆయన కొనియాడారు.






కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ వైరస్‌ను నిర్మూలించడానికి ఎన్నో దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. మన దేశంలోనూ 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 14 రోజుల లాక్‌డౌన్ ముగిసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఇంకో వారం రోజుల లాక్‌డౌన్ పీరియడ్ మిగిలి ఉంది. కానీ, ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ లాక్‌డౌన్‌ను మరింత పొడిగించే అవకాశం ఉంది. అయితే, ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లలో ఉన్నా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తు్న్నారు. ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు.






కరోనా నుంచి ప్రజలను కాపాడటమే ధ్యేయంగా దేశంలో ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది పోరాడుతున్నారు. అలాంటి వారిని ఉద్దేశించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. నేడు (ఏప్రిల్ 7) ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆయన ఈ పోస్ట్ పెట్టారు.‘‘రెండు వారాల లాక్‌డౌన్.. మనం శక్తివంతమవుతున్నాం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు ఐక్యంగా చేపట్టిన ప్రయత్నాలను కచ్చితంగా మెచ్చుకోవాలి. కోవిడ్-19పై మనం చేస్తోన్న యుద్ధంలో ముందు వరుసలో నిలబడిన వారందరికీ ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాడు కృతజ్ఞతలు చెప్పుకుందాం. మన ఆరోగ్యం కోసం వారు పోరాడుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో వీధులు, ఆసుపత్రుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతోన్న ఆ యోధులందరికీ వందనం. వారందరినీ దేవుడు చల్లగా చూడాలి’’ అని మహేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.కరోనాపై పోరాడుతోన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సూపర్ స్టార్.. ప్రజలకు జాగ్రత్తలు కూడా చెప్పారు. ‘‘సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడంతో పాటు ధైర్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. భయానికి దూరంగా ఉండాలి. భయాందోళనలను కలిగించే మనుషులు, వార్తలకు మనం దూరంగా ఉండాలి. తప్పుడు వార్తలు ఈ సమయంలో పెద్ద సమస్య. తప్పుదోవ పట్టించే వార్తలకు దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరూ దీన్ని చదివి పాజిటివిటీ, ప్రేమ, ఆశ, సహానుభూతిని వ్యాప్తి చేయాలని కోరుతున్నాను. ఇలాంటి సమయంలో మనమందరం కలిసికట్టుగా ఉండాలి. ఇంట్లో ఉండండి.. భద్రంగా ఉండండి’’ అని మహేష్ బాబు తన పోస్ట్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు