ఐసోలేషన్ వార్డులుగా రైల్వే ఏసీ బోగీలు ... కాకినాడలో సన్నాహాలు

Indian Railway:ఏపీలో ఐసోలేషన్ వార్డులుగా ఏసీ బోగీలు.. రైల్వే అధికారుల వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు ఏపీలో రైల్వే ఏసీ బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.పలుచోట్ల నిలిచిపోయిన రైళ్ల లోని ఏసీ బోగీలతో ఓర్పట్లు 




                                 రాష్ట్రంలో కరోనా  (కోవిడ్ ) కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో రైళ్లలోని ఏసీ బోగీలను ఐసోలేషన్‌ వార్డులుగా మార్చేందుకు రైల్వే అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో మార్చి 23న రైళ్ల రాకపోకలను నిలుపుదల చేశారు. ఈ సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలోని వివిధ స్టేషన్లలో 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిచిపోయాయి. జిల్లాలోని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో షిర్డీ ఎక్స్‌ప్రెస్, హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌లను నిలుపుదల చేశారు.నిడదవోలు స్టేషన్‌లో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపారు. ఇలా ఏలూరు, భీమవరం, నరసాపురం తదితర రైల్వే స్టేషన్లలో మొత్తం 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపి ఉంచారు. ఈ రైళ్లలో ఉన్న ఏసీ కోచ్‌లను ఐసొలేషన్‌ వార్డులుగా మార్చేందుకు గాను కాకినాడ తరలించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది.
షంటింగ్‌ విధానంలో జిల్లాలోని స్టేషన్‌లలో నిలుపుదల చేసిన ఈ 8 రైళ్లలోని ఏసీ బోగీలను ఒక్కటిగా లింక్‌ చేసి కాకినాడ తరలించనున్నట్లు ఓ రైల్వే అధికారి వెల్లడించారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు