ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్..ముందే సీఎంతో భేటీ
షాకింగ్ ఘటన... కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ అని తేలింది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఈయన మంగళవారం సీఎంతోపాటు పలువురు మంత్రులతో భేటీ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ భేటీలో నేతలు సోషల్ డిస్టెన్సింగ్ పాటించారని ప్రభుత్వం చెబుతోంది. కానీ అహ్మదాబాద్ మిర్రర్ దగ్గరున్న ఫొటోలను బట్టి చూస్తే ఈ భేటీలో నేతలంతా మాస్కులు తీసేసి కనిపించారు. దరియాపూర్ ఎమ్మెల్యే గ్యాసుద్దీన్ కూడా ఇమ్రాన్ కారులో ప్రయాణించారని అహ్మదాబాద్ మిర్రర్ వెల్లడించింది. సీఎం ఆఫీసులోకి వెళ్లడానికి ముందు శరీర ఉష్ణోగ్రతతోపాటు బ్లడ్ రిపోర్ట్ చూస్తున్నారు. కానీ కరోనా సోకిన ఇమ్రాన్ సీఎం ఆఫీసులోకి వెళ్లడాన్ని బట్టి అక్కడ సెక్యూరిటీ సరిగా లేదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్వీపీ హాస్పిటల్లో చేరారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న జమల్పూర్ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆయన తన నియోజకవర్గ ప్రజలకు చేదోడుగా నిలుస్తూ సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి