
అయితే ఆయన అంత్యక్రియలను చెన్నైలోని అంబత్తూరు ప్రాంతంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తమ ప్రాంతంలో అంత్యక్రియలు జరపొద్దంటూ అక్కడి స్థానికులు గుంపులుగా చేరుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దహనసంస్కారాలు నిర్వహిస్తే తమ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అడ్డుకున్నారు. దీంతో మృతదేహాన్ని తీసుకుని వెనక్కు వెళ్లిన సిబ్బంది తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారి వెంట సీనియర్ పోలీసు అధికారులు వచ్చి.. మృతదేహానికి దహన సంస్కారాలు చేయడం ద్వారా కరోనా వ్యాప్తి చెందదని వివరించారు. మృతదేహాన్ని దహనం చేయడం ద్వారా కరోనా వస్తుందని సైంటిఫిక్గా ఎలాంటి నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు. దీంతో చివరకు వివాదం సర్దుమణిగింది.కాగా, రాష్ట్రంలో సైతం కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసు సంఖ్య 439కి చేరుకుంది. గుంటూరులో అత్యధికంగా 93 మందికి కరోనా సోకింది. తర్వాతి స్థానంలో 84 కరోనా కేసులతో కర్నూలు నిలిచింది. మరో మూడు జిల్లాలోనూ కరోనా ప్రతాపం చూపుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి