హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా..హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా..

 కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ అమలులో ముందుండి నడుస్తున్న పోలీసు విభాగంలో కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌‌లోని సైఫాబాద్‌లో హెడ్ కానిస్టేబుల్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. భాగ్యనగరం పోలీసు విభాగంలో ఇదే తొలి కరోనా కేసు కావడం గమనార్హం.



 

 

 






 





                                                                                                 హైదరాబాద్ పోలీసు విభాగంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. సైఫాబాద్ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ స్టేషన్లో పని చేసే 12 మంది సిబ్బంది క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన ఎక్కడికీ ప్రయాణించలేదని తెలుస్తోంది. పోలీసు శాఖలో, అందులోనూ హైదరాబాద్‌లో పని చేసే హెడ్ కానిస్టేబుల్‌కు కోవిడ్ సోకడంతో.. తెలంగాణ పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఇంతకు ముందు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డీఎస్పీగా పని చేసే వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన కుమారుడు లండన్ నుంచి తిరిగి రాగా.. కొడుకు నుంచి సదరు అధికారికి ఇన్ఫెక్షన్ సోకింది. తెలంగాణ పోలీసు విభాగంలో నమోదైన తొలి కేసు ఇది.మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 364కు చేరింది. ఈ వైరస్ బారిన పడి రాష్ట్రంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 45 మంది ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. సోమవారం ఒక్క రోజే 30 కొత్త కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 308కి చేరింది.అత్యధికంగా హైదరాబాద్‌లో 133 మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా.. నిజామాబాద్‌లో 26 మంది చికిత్స పొందుతున్నారు. తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ (23) ఉంది. రాష్ట్రంలోని 25 జిల్లాలకు కరోనా విస్తరించింది.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు