ఏపీలో 41;తెలంగాణలో 128;... తూ. గో లో 12

ఏపీలో గురువారం రాత్రి నాటికి జిల్లాల వారగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి. నెల్లూరు 24, కృష్ణా 23, గుంటూరు 20, కడప 18, ప్రకాశం 17, పశ్చిమ గోదావరి 15, తూర్పు గోదావరి 12, విశాఖపట్నం 11, చిత్తూరు 9, అనంతపురం 2, కర్నూల్‌లో ఒక కేసు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదకాలేదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.


 

                                                                                ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే ఏకంగా 41 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 128 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


ఏపీలో కరోనా గంటగంటకూ విజృంభిస్తోంది. పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా మరో 9 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. గురువారం సాయంత్రం ఆరు గంటల వరకూ 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరు గంటల తరువాత వచ్చినకోవిద్ 19 ఫలితాల్లో మరో 9 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 152కి పెరిగింది.




                                                                                  అయితే ఈ రోజు మధ్యాహ్నం ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతరం మధ్యాహ్నం మూడు, సాయత్రానికి మరో 8 పాజిటివ్ కేసులు గుర్తించారు. దీంతో ఏపీలో సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 143కి చేరింది. సాయంత్రం 6 గంటల తర్వాత అందిన కరోనా టెస్టుల ఫలితాల్లో కొత్తగా 9 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఏపీలో 41 కేసులు పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది.

ఏపీలో గురువారం రాత్రి నాటికి జిల్లాల వారగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి. నెల్లూరు 24, కృష్ణా 23, గుంటూరు 20, కడప 18, ప్రకాశం 17, పశ్చిమ గోదావరి 15, తూర్పు గోదావరి 12, విశాఖపట్నం 11, చిత్తూరు 9, అనంతపురం 2, కర్నూల్‌లో ఒక కేసు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదకాలేదు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు