రంగులు 3 వారాల్లో మార్చండి ;;హై కోర్టు
పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులేయాలని హైకోర్టు ఇదివరకే తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తీర్పు అమలుకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. రంగులు తొలగించేందుకు ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చింది.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీ జెండా పోలిన రంగులు వేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కచ్చితంగా రంగులు తొలగించాలని ఆదేశించింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి