దేశంలో 2500 దాటిన కరోనా కేసులు.62కు చేరిన మృతుల సంఖ్య
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2547కు చేరింది. కోవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 62కు చేరింది. కాగా ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న 163 మంది డిశ్చార్జ్ అయ్యారని కేంద్రం తెలిపింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ శుక్రవారం సాయంత్రం నాటికి కరోనా వైరస్ కేసుల సంఖ్య 161కి చేరింది. రాష్ట్రంలో తొలి కోవిడ్ మరణం నమోదైంది. కరోనా కారణంగా అహ్మదాబాద్లోనూ ఒకరు చనిపోగా.. గుజరాత్లో కరోనా మరణాల సంఖ్య 9కి చేరింది.మధ్యప్రదేశ్లో భోపాల్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జె.విజయ్ కుమార్కు కరోనా పాజిటివ్ అని తేలింది. రెండోసారి నిర్వహించిన పరీక్షలోనూ ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఒడిశాలో మరో ముగ్గురికి కోవిడ్ సోకగా.. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9కి చేరింది.కరోనా ప్రభావంతో రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. కేంద్రం నుంచి సాయం కోరుతున్నాయి. రాష్ట్రాల అభ్యర్థనకు స్పందించిన కేంద్రం.. స్టేట్ డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫండ్ తొలి ఇన్స్టాల్మెంట్ కింద రూ.11,092 కోట్లు మంజూరు చేసింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి