రజక స్త్రీ దాతృత్వం .... బట్టలు ఉతికి కూడబెట్టిన రూ.25 వేలు విరాళం;;;మంచి మనసుకు మంత్రి హరీశ్ ఫిదా

సాటి మనిషి కష్టంలో ఉన్నాడని తెలిస్తే కొందరు మనసు కలుక్కుమంటది. కష్టం విలువ, ఆకలి బాధ తెలిసినోళ్లకైతే అస్సలు నిద్ర పట్టదు. అలాంటి కోవకే చెందుతుంది ఈ బుచ్చమ్మ.ఈ అవ్వ సాయం మంత్రి హరీష్ రావు దృష్టికి వచ్చింది. ‘బుచ్చవ్వ నీ సాయం వెలకట్టలేనిది. ‘కరోన వైరస్ దెబ్బకు కుదేలవుతున్న బిడ్డలకు నువ్వే కన్న తల్లివైనవు. వాళ్ల గోసలో బాగం పంచుకుందామనుకున్న నీ ఆరాటం ఎందరికో స్పూర్తిదాయకం. హృదయపూర్వక అభినందనలు’ అని మంత్రి ట్వీట్ చేశారు.


 





                                                                                                          లాక్‌డౌన్ ప్రభావంతో రెక్కాడితే గానీ డొక్క ఆడని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వాలు సాయం చేస్తున్నప్పటికీ అది సరిపోవడం లేదు. దీంతో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదలకు తమ వంతు సాయం చేస్తున్నారు.జగిత్యాల  జిల్లా కోరుట్లకు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు నాలుగేళ్లుగా బట్టలు ఉతికి కూడబెట్టిన రూ.25 వేలను పేదలకు పంచింది. వివరాల్లోకి వెలైట్  కోరుట్లకు చెందిన గొల్లపల్లి బుచ్చవ్వ, గంగారం దంపతులు. బుచ్చవ్వ బట్టలు ఉతికితే, గంగారాం ఇస్త్రీ చేసేవాడు. అలా పని చేసుకుంటూ ముగ్గురు కొడుకులను పెంచి పెద్ద చేశారు. ఇద్దరు కొడుకులు కులవృత్తి చేసుకుంటుండగా.. మరొక కుమారుడు హైదరాబాద్‌లో సీఏగా పని చేస్తున్నారు. వయోభారం కారణంగా గంగారాం విశ్రాంతి తీసుకుంటుండగా.. బుచ్చవ్వ మాత్రం కష్టం చేయడం మానుకోలేదు. ఆమె రోజూ ఇళ్లలో బట్టలు ఉతికేది. ఇలా కష్టపడి ఖర్చులు పోనూ నాలుగేళ్లలో రూ.25 వేలు కూడబెట్టింది.





ఈ వయసులో ఎవరైనా తమ దగ్గర డబ్బులు ఉండాలని కోరుకుంటారు. కానీ బుచ్చవ్వ మాత్రం లాక్‌డౌన్ తర్వాత పేదలు తిండికి కూడా ఇబ్బంది పడుతుండటాన్ని గమనించింది. తన దగ్గరున్న పాతిక వేలను వారికి సాయం చేద్దామని భర్తతో చెప్పింది. ఆయన సరే అనడంతో.. తమ వార్డులో ఉన్న నిరుపేదలకు కుటుంబానికి రూ.1500 చొప్పున విరాళంగా ఇచ్చేసింది.
పేదలకు డబ్బులు ఇచ్చిన విషయమై బుచ్చవ్వ స్పందిస్తూ.. తమ వార్డులో ఉన్నంటున్న వాళ్ల కష్టాలను చూస్తే గోస అనిపించిందని ఏదైనా సాయం చేద్దామని మా ఆయన కూడా అన్నాడని చెప్పింది. తమ చిన్న కొడుకు లక్ష రూపాయలు సాయం చేశాడని.. తమను కూడా ఇవ్వమని చెప్పింది.ఈ అవ్వ సాయం మంత్రి హరీష్ రావు దృష్టికి వచ్చింది. ‘బుచ్చవ్వ నీ సాయం వెలకట్టలేనిది. ‘కరోన వైరస్ దెబ్బకు కుదేలవుతున్న బిడ్డలకు నువ్వే కన్న తల్లివైనవు. వాళ్ల గోసలో బాగం పంచుకుందామనుకున్న నీ ఆరాటం ఎందరికో స్పూర్తిదాయకం. హృదయపూర్వక అభినందనలు’ అని మంత్రి ట్వీట్ చేశారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు