
కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్ నెల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 46,038 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ఆయా రాష్ట్రాలకు విడుదల చేసిన నిధుల వివరాలను పేర్కొంది. ఏపీకి రూ. 1,892.64 కోట్లు, తెలంగాణకు రూ. 982 కోట్లు విడుదల చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. 2,874.64 కోట్లు విడుదలయ్యాయి.15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ. 8,255.19 కోట్లు, అత్యల్పంగా గోవాకు రూ. 177.72 కోట్లు విడుదల చేసింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆర్థిక లోటు ఉన్నా.. రాష్ట్రాలకు ఇచ్చే పన్ను వాటాలో కేంద్రం కోత విధించలేదు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 మహమ్మారి ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చింది.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి