2, 3 దశల మధ్య కరోనా; భారత్ కేంద్ర ఆరోగ్య శాఖ


రెండో దశలో విదేశాల నుంచి వచ్చిన వారికి, వారితో కాంటాక్ట్ అయిన వారికి వైరస్ సోకుతుంది. మూడో దశ లేదా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌లో కరోనా సోకిన వ్యక్తి ఎవరిని కాంటాక్ట్ అయ్యారో తెలుసుకోవడం కష్టం అవుతుంది. అంటే అతడు ప్రయాణం చేయకపోయినా కోవిడ్ సోకుతుంది లేదా.. వైరస్ సోకిన ఎవర్ని కలిశాడో స్పష్టంగా తెలియదు.భారత్ కరోనా రెండు, మూడు దశల మధ్య ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో కరోనా లోకలైజ్డ్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దలిపింది




                                                                                                                దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వేళ కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. మన దేశం కోవిడ్ రెండు, మూడో దశల మధ్య ఉందని కేంద్రం తెలిపింది. భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరిందన్న ఎయిమ్స్ డైరెక్టర్ అభిప్రాయంతో ఆరోగ్య శాఖ ఏకీభవించింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లోకలైజ్డ్ కరోనా కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ దశకు చేరిందని.. రెండు, మూడో దశల మధ్య దేశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. దేశంలోని చాలా ప్రాంతం రెండో దశలో ఉందని ఆయన చెప్పారు. కోవిడ్‌-19పై పోరాటానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌లో గులేరియా సభ్యులు.తక్కువ సంఖ్యలో కేసులు నమోదైనప్పుడు క్లస్టర్ కంటైన్‌మెంట్ స్ట్రాటజీని అనుసరిస్తామని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్.. ఎక్కువ కేసులు నమోదైతే ప్రభుత్వ యాక్షన్, జోక్యం తీవ్రం అవుతుందన్నారు. ఒక వేళ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అనేది ఉంటే ముందుగా ప్రభుత్వమే అందర్నీ అప్రమత్తం చేస్తుందన్నారు.
ఏయిమ్స్ డైరెక్టర్ లోకలైజ్డ్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అన్నారన్న లవ్ అగర్వాల్.. దాని అర్థం ఒకే చోట ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం అన్నారు. ‘మనం స్టేజ్-2, స్టేజ్-3 మధ్య ఉన్నాం. స్టేజ్-3లోకి వెళ్లకుండా ప్రయత్నాలపై ఫోకస్ పెట్టాల’ని లవ్ అగర్వాల్ తెలిపారు.




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు