చెన్నై టు శ్రీకాకుళం బోటులో ;;1.70 లక్షలతో బోటు కొని 5 రోజులు సముద్రంలో..

చెన్నై నుంచి సముద్ర మార్గం గుండా రావడానికి బోటు సౌకర్యం లేకపోవడంతో 27 మంది మత్స్యకారులు రూ. 1. 70 లక్షలతో కొత్త బోటును కొనుగోలు చేసి ఆ బోటు ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. వీరు 5 రోజుల పాటు ప్రయాణం చేసి ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు డొంకూరు తీరప్రాంత సమీపానికి చేరుకుననారు. సోమవారం ఉదయం ఒడ్డుకు చేరుకోగా, అక్కడే మాటువేసిన పోలీసులు వారిని క్వారంటైన్ కేంద్రానికి పంపించారు.



 






.





                                                                                                             తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో 27 మంది మత్స్యకారులు రూ. 1.70 లక్షలతో బోటు కొనుగోలు చేసి 5 రోజుల పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణించిశ్రీకాకుళం  జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలోని ఇచ్ఛాపురం మండలం డొంకూరు తీర ప్రాంతానికి 27 మంది మత్స్యకారులు సోమవారం ఉదయం చేరుకోగా, వారిని అక్కడే అదుపులోకి తీసుకున్న పోలీసులు క్వారంటైన్‌కు తరలించారు.శ్రీకాకుళం తీరానికి వచ్చిన 27 మందిలో 10 మంది ఒడిసా రాష్ట్రంలోని సున్నాపురం ప్రాంతానికి చెందిన వారు కాగా, ఒకరు శ్రీకాకుళం సమీపంలోని జగతివానిపేట ప్రాంతానికి, మిగతా 16 మంది డొంకూరు ప్రాంతానికి చెందినవారు. వీరు చెన్నై  నుంచి బయల్దేరారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరి కోసం గత రెండు రోజులుగా పోలీసులు డొంకూరు ప్రాంతం వద్ద పహారా కాస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదంయం వారు డొంకూరు తీర ప్రాంతం వద్దకు చేరుకోగా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. వినోద్ బాబు, రెవెన్యూ యంత్రాంగం అక్కడికి చేరుకుని వారిని ఇచ్చాపురం మున్సిపాలిటీలోని పురుషోత్తపురం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్‌లో క్వారంటైన్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, వారు చెన్నై నుంచి సముద్ర మార్గం గుండా రావడానికి బోటు సౌకర్యం లేకపోవడంతో 27 మంది మత్స్యకారులు రూ. 1. 70 లక్షలతో కొత్త బోటును కొనుగోలు చేసి ఆ బోటు ద్వారా ఇక్కడికి చేరుకున్నారు. వీరు 5 రోజుల పాటు ప్రయాణం చేసి ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు డొంకూరు తీరప్రాంత సమీపానికి చేరుకుననారు. సోమవారం ఉదయం ఒడ్డుకు చేరుకోగా, అక్కడే మాటువేసిన పోలీసులు వారిని క్వారంటైన్ కేంద్రానికి పంపించారు.




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు