ముంబయి వైద్యులు ;బిస్కట్లు, నీళ్లతోనే కడుపు నింపేసుకుంటున్నారు

                                                                                                                  కరోనా వైరస్ నేపథ్యంలో వైద్యులు రేయింబవళ్లు శ్రమించాల్సిన పరిస్థితి నెలకొంది. కోవిడ్-19 కేసులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల ముంబయి వైద్యులు అష్టకష్టాలు పడుతున్నారు. ముంబయిలోనే రెండో అతి పెద్ద హాస్పిటల్‌గా పేరొందిన కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు కనీసం ఆహారం కూడా సరిగా అందటం లేదు. దీంతో బిస్కట్లు, నీళ్లతోనే కడుపు నింపేసుకుంటున్నారు. రోజుకు 12 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నారు.ముంబయిలోని మున్సిపాలిటీ హాస్పిటళ్లకు తాజ్ హోటల్ నుంచి పార్శిళ్లు అందుతున్నాయని, అవి విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి సరిపోవడం లేదంటూ వైద్యులు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు.‘‘కేఈఎం హాస్పిటల్, ఇతరాత్ర బీఎంసీ మున్సిపాలిటీ హాస్పిటళ్లో పనిచేస్తున్న రెసిడెంట్ డాక్టర్లకు మెస్ లేదా క్యాంటీన్ల నుంచి ఆహారం అందటం లేదు. వైద్యులు తమ ఇళ్లకు వెళ్లకుండా రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అందువల్ల తమతో ఆహారాన్ని తెచ్చుకోలేకపోతున్నారు. లాక్‌డౌన్ వల్ల బయట టిఫిన్లు కూడా లభించడం లేదు’’ అని శ్రీదేవి తాంక్సాలే అనే యూజర్ థాకరేకు ట్వీట్ చేసింది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు