సినీ నటుడికి కరోనా లక్షణాలు.

అతడు వారం రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు బాధిత యువకుడి తల్లి చెప్పారు. తొలుత వైద్య సేవలు చేయించుకునేందు ఆ యువకుడు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.

                                                                                                         గుంటూరు జిల్లాలో మరో కరోనా  (కోవిడ్ 19) అనుమానిత కేసు నమోదైంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఓ యువకుడికి (30) కరోనా లక్షణాలు కనిపించడంతో అనుమానిత కేసుగా నమోదు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సహాయ నటుడిగా నటించే సదరు యువకుడు 10 రోజుల క్రితం బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. శనివారం రాత్రి పల్నాడు రైల్లో పిడుగురాళ్ల చేసుకుంటున్నాడు.అయితే అతడు వారం రోజులుగా జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు బాధిత యువకుడి తల్లి చెప్పారు. తొలుత వైద్య సేవలు చేయించుకునేందు ఆ యువకుడు సహకరించలేదని తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వైద్య పరీక్షలు చేయాంచుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆ యువకుడికి అవగాహన కల్పించారు. దీంతో వైద్యసేవలు చెపించుకునేందుకు ఆ యువకుడు సిద్ధమయ్యాడు. వెంటనే బాధిత యువకుడిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు, వైద్య బృందం తరలించినట్లు సమాచారం. కాగా, బ్యాంకాక్‌లో ఇప్పటి వరకు దాదాపు 600 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గుంటూరులో కరోనా అనుమానిత కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు