కరోనా ; సామర్లకోట రైల్వే స్టేషన్లో వారణాసి నుండి వచ్చిన యాత్రికులు ;వీరంతా కాకినాడసమీపంలోని కరప గ్రామ వాసులు

 


తూ. గో.జిల్లా ;తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట రైల్వే స్టేషనలో వారణాసి నుంచి సామర్లకోట చేరుకున్నయాత్రికులు  ఆదివారం ఒక రైలు నుండి దిగడంతో అధికారులు  అప్రమత్తం  అయ్యారు .  వారణాసి నుంచి సామర్లకోట చేరుకున్నఈ  యాత్రికులు కాకినాడ రురల్ మండలం కరప గ్రామానికి  చెందిన వారు . సుమారు 60 మంది యాత్రికులలో స్త్రీలు, పురుషులు ఉన్నారు. యాత్రికుల  యోగ క్షేమ  వివరాలను  వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు ఫోన్లో  అడిగి తెలుసుకున్నారు. వీరిని  వైద్యపరీక్షల నిమిత్తము కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు 


 


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు