బయటకొస్తే కేసులు తప్పవు ;కరోనా ఎఫెక్ట్: ఏపీలో 70 వేల కేసులు, 6 వేల వాహనాలు సీజ్

Coronavirus: నిబంధనలు అతిక్రమించిన దాదాపు 70 వేల మందిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచించారు.





 




                                                                                                   కరోనాను కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ విపత్తుగా ప్రకటించిందని, కాబట్టి ఎవరూ బయటకు రావొద్దని డీజీపీ సవాంగ్ పిలుపునిచ్చారు. ఏపీలోకి రావాలని ఇతర రాష్ట్రాల నుంచి బోర్డర్ దగ్గరకు ఎవరూ రావొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా వస్తే అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.కరోనా (కోవిడ్ 19) ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ఏపీలో లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన 4,005 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే 6,571 వాహనాలు సీజ్ చేశామని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 69,839 మందిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధించినట్లు చెప్పారు.                                                                                                                                                                                                       తాము కావాలని కేసులు పెట్టడం లేదని, ఓవైపు కేసులు పెట్టాలన్నా బాధగా ఉందని డీజీపీ సవాంగ్ చెప్పారు. కాబట్టి ఎవరూ దీన్ని తప్పుగా తీసుకోవద్దని కోరారు. ప్రతి పోలీస్‌కూ కుటుంబం ఉంటుందని, కానీ రాత్రింబగళ్లు సెలవులు కూడా లేకుండా వారు ప్రజల కోసం కష్టపడుతున్నారని తెలిపారు. పోలీసులు చాలా క్లిష్ట పరిస్థితుల్లో పని చేస్తున్నారని, తమకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అందరం కలిసి కరోనా మహమ్మారిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.అలాగే కరోనాను కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ విపత్తుగా ప్రకటించిందని, కాబట్టి ఎవరూ బయటకు రావొద్దని డీజీపీ సవాంగ్ పిలుపునిచ్చారు. ఏపీలోకి రావాలని ఇతర రాష్ట్రాల నుంచి బోర్డర్ దగ్గరకు ఎవరూ రావొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా వస్తే అది చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు.



కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు