ఉద్యోగులకు మోదీ అభయం...;4శాతం డీ ఏ పెంపు

మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు  శుభవార్త అందించారు...         4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నెలకు రూ క్యాడర్‌ను బట్టి రూ 720 నుంచి రూ 10,000 వరకూ పెరగనుంది.



                                                                                                          ఉద్యోగులకు సర్కారు శుభవార్త వినిపించింది. కరువుభత్యం(డీఏ)ను పెంచుతూ కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 4 శాతం డీఏను పెంచేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏ పెంపును చేపడతారు. 4 శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనం నెలకు రూ క్యాడర్‌ను బట్టి రూ 720 నుంచి రూ 10,000 వరకూ పెరగనుంది. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 90 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు