3 సార్లు ఉచిత రేషన్....పింఛన్‌దారులు, పేదలకు సీఎం జగన్ గుడ్‌ న్యూస్..

YS Jagan Mohan Reddy: రాష్ట్రంలో ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించి మూడు సార్లు రేషన్ సరుకులు అందించాలని సూచించారు.


                                                                                        అమరావతి ;రాష్ట్రంలో ఏప్రిల్‌ 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌ 4వ తేదీన నిరుపేదలకు రూ.1,000 చొప్పున పంపిణీ చేస్తామని వెల్లడించారు. శనివారం మంత్రులు, అధికారులతో సమీక్షించిన సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం (మార్చి 29) రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు పంపిణీ చేయాలని సూచించారు.                                                                                                                   అలాగే ఏప్రిల్‌ 15న మరోసారి బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని, ఏప్రిల్‌ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేస్తామని జగన్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో మూడు నెలలకు సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు వైసీపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.                                                                                                      ఇందులో భాగంగా ఠంచన్‌గా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు.కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 16 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో నాలుగు, విజయవాడలో మూడు, గుంటూరులో రెండు, నెల్లూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో మూడు, రాజమండ్రిలో ఒకటి, తిరుపతిలో ఒకటి, కర్నూలులో ఒకటి చొప్పున మొత్తం 16 కేసులు నమోదయ్యాయి


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు