జగన్‌ సర్కార్‌కు షాక్‌...! గవర్నర్‌తో మండలి చైర్మన్‌ కీలక భేటీ.. 

 



గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ భేటీ అయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న పరిణామాల ను గవర్నర్‌కు వివరించారు.
:రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి 7 గంటల  సమయంలో రాజ్‌భవన్‌కు చేరుకున్న షరీఫ్‌.. గవర్నర్‌తో కీలక అంశాల పై చర్చించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు , సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లు ను సెలెక్ట్‌ కమిటీకి పంపించే విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.గవర్నర్‌ను కలిసిన అనంతరం మండలి చైర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాలని రెండు సార్లు ఆదేశించినా మండలి కార్యదర్శి సంబంధిత ఫైళ్లను  వెనక్కి పంపించారని తెలిపారు. చైర్మన్‌ ఆదేశించినా రూలింగ్‌ చేయకుండా కార్యదర్శి జాప్యం చేస్తున్నారని చెప్పారు.మండలిలో జరిగిన పరిణామాపై వివరించినట్లు షరీఫ్‌ తెలిపారు. చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించిన మండలి కార్యదర్శిపై చర్యలు  తీసుకోవాని కోరినట్లు వెల్లడించారు . సెలెక్ట్‌ కమిటీ నిబంధనలకు వ్యతిరేకంగా చేసింది కాదని స్పష్టం చేశారు.దీనిపై కల్పించుకుని వెంటనే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేయాని కోరారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు