చైనా నుండి పాక్కు మిస్సైల్ పరికరాలు అక్రమ సరఫరా...! భారత్కు చిక్కిన చైనా నౌక?
చైనా నుంచి పాకిస్థాన్కు మిస్సైల్ పరికరాలను మోసుకెళ్తూ.. ఓ నౌక కాండ్లా తీరంలో కస్టమ్స్ అధికారుకు చిక్కింది.భద్రతా సిబ్బందితోపాటు డీఆర్డీవో అధికాయి కూడా ఈ నౌకలో తనిఖీ చేపడుతున్నట్టు సమాచారం.
గుజరాత్ :ఓ పక్క కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తోన్నా.. చైనా మాత్రం తన మిత్రదేశం పాకిస్థాన్కు అండగా ఉండటం మానడం లేదు. హాంగ్కాంగ్ జెండాతో ఉన్న నౌకను కస్టమ్స్ విభాగం అధికాయి ఫిబ్రవరి 3న కాండ్లా పోర్టులో పట్టుకున్నారు. భద్రతా సంస్థ, డీఆర్డీవో నిపుణులు ఆ నౌకను సునిశితంగా పరిశీలిస్తూ.. విచారణ చేపడతున్నారు. గుజరాత్ తీరంలో చైనా నౌకను పట్టుకోవడం ఏంటి? డీఆర్డీవో కూడా రంగంలోకి దిగడం ఏంటని అనుకుంటున్నారా?‘డ కుయ్ యున్’ అనే నౌక జనవరి 17న చైనాలోని జియాంగ్యిన్ పోర్టు నుంచి బయల్దేరింది. ఇది కరాచీలోని ఖాసిం పోర్టుకు వెళ్లాల్సింది. ఈ నౌకలో మిస్సైళ్ల తయారీలో ఉపయోగించే కొన్ని పరికరాలు ఉన్నాయని భారత్ గుర్తించింది. ఇక్కడి నుంచి కొన్ని వస్తువులను తీసుకెళ్లడం కోసం లేదా అన్లోడ్ చేయడం కోసం కోసం కాండ్లా పోర్టులోని జెట్టీలో ఈ నౌక లంగర్ వేసింది. కానీ కస్టమ్స్ అధికారుకు అనుమానం వచ్చి తనిఖీ జరిపారు.ఈ నౌకలో వేల టన్నులు బరువు ఉండే ఆటోక్లెవ్, ప్రెషర్ ఛాంబర్ను తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. వీటిని మిస్సైళ్లను లాంచింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ ఘటన ద్వారా ఆయుధాలను అందించడంలో పాకిస్థాన్కు చైనా సహకరిస్తోన్న విషయం మరోసారి మెగులోకి వచ్చింది. 1999లో కార్గిల్ యుద్ధం సమయంలో ఉత్తర కొరియాకు చెందిన ఓ నౌక కూడా ఇలాగే మిస్సైల్ భాగాను పాక్కు మోసుకెళ్తూ కాండ్లా రేవులో పట్టుబడిరది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి