ముంబై ఉగ్రదాడి...  కసబ్‌ చేతికి ఎర్ర దారం వెనుక విస్మయం గొలిపే వాస్తవాలు ..!


2008 నాటి ముంబై ఉగ్రదాడిలో 166 మంది చనిపోగా.. ప్రాణాతో పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాది కసబ్‌. అతడి చేతికి ఉన్న ఎర్ర దారం వెనుక భారీ కుట్ర దాగి ఉందని ముంబై మాజీ పోలీసు కమిషనర్‌ రాకేశ్‌ మరియా తెలిపారు.
ముంబై :26/11 ముంబై ఉగ్రదాడు విషయమై ముంబై మాజీ పోలీసు కమిషన్‌ రాకేశ్‌ మరియా సంచనలన  విషయాలను వ్లెడిరచారు. 2008 నాటి ముంబై దాడును హిందూ ఉగ్రదాడిగా చిత్రీకరించేందుకు ష్కరే తొయిబా కుట్ర పన్నిందని రాకేశ్‌ ఆరోపించారు. ఆయన రాసిన ‘లెట్‌ మీ సే ఇట్‌ నౌ’ అనే పుస్తకంలో సంచలన అంశాలను పొందుపర్చారు. పాకిస్థాన్‌ ఉగ్రవాది మహ్మద్‌ అజ్మల్‌ కసబ్‌ను బెంగళూరుకు చెందిన సమీర్‌ చౌదరిగా నమ్మించేలా లష్కరే తొయిబా కుట్ర పన్నిందని మరియా తెలిపారు.ముంబైలో మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులను భారతీయులు గా నమ్మించడం కోసం లష్కరే తొయిబా నకిలీ ఐడీ కార్డును సృష్టించిందని మరియా తెలిపారు. అంతా ప్లాన్‌ ప్రకారమే జరిగితే కసబ్‌ ఓ హిందువుగా చనిపోయేవాడు, మీడియా హిందూ ఉగ్రవాదులే ఈ దాడికి కారణమని నిందించేది అని రాకేశ్‌ తన బుక్‌లో రాసుకొచ్చారు.ఓ ఫొటోలో కసబ్‌ చేతికి ఎర్రటి దారం ఉంది. అతణ్ని హిందువుగా నమ్మించడం కోసం కుడి చేతికి అలా దారం కట్టారు. చాలా మంది అతడు హిందువు అని నమ్ముతారని.. ఫలితంగా 26/11 దాడును ‘హిందు ఉగ్రవాదం’గా నమ్మించొచ్చని ష్కరే తొయిబా కుట్రపన్నిందని మరియా తన బుక్‌లో వ్లెడిరచారు.హిందూ ఉగ్రవాదు ముంబైలో ఎలా మారణ హోమం సృష్టించారో చూడండి అంటూ.. న్యూస్‌ పేపర్లలో భారీ ఎత్తున కథనాు వస్తాయని.. టాప్‌ టీవీ జర్నలిస్టు నకిలీ ఐడీ కార్డును నిజమనుకొని కసబ్‌ ఫ్యామిలీని పొరుగింటి వాళ్లను ఇంటర్వ్యూ చేయడం కోసం లైన్లు కడతారని ష్కరే తొయిబా భావించింది. కానీ కసబ్‌ పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందినవాడని విచారణలో తేలిందని మరియా తెలిపారు.ఈ దాడుల్లో వీరమరణం పొందిన కానిస్టేబుల్‌ తుకారం ఓంబ్లే కసబ్‌ను ప్రాణాతో పట్టుకోవడంతో ష్కరే కుట్ర భగ్నమైందన్నారు. కసబ్‌ దొంగతనాు చేయడం కోసం ష్కరే తొయిబాలో చేరాడని.. జిహాద్‌కు అతడితో సంబంధం లేదన్నారు. భారత్‌లో ముస్లింను నమాజ్‌ చేసుకొనివ్వరని కసబ్‌ను నమ్మించారన్నారు. అందుకే మెట్రో సినిమా సమీపంలోని మసీదుకు వెళ్లినప్పుడు కసబ్‌ షాకయ్యాడన్నారు.
పాకిస్థాన్‌కు చెందిన 10 మంది ఉగ్రవాదు భారీ మారణాయుధాతో ముంబైలోని పు ప్రాంతాల్లో దాడుకు ప్పాడ్డారు.ఈ మారణ హోమంలో మొత్తం 166 మంది ప్రాణాు కోల్పోగా.. 300 మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో ప్రాణాతో పట్టుకున్న ఏకైక ఉగ్రవాది కసబ్‌ మాత్రమే. 2012 నవంబర్‌ 21న అతణ్ని ఉరి తీశారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు