రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ దాడులు ..! అవినీతిపై జగన్‌ సర్కార్‌ ఉక్కుపాదం..  వరుస ఫిర్యాదుతో ఏసీబీ దూకుడు.


టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌, మున్సిపల్‌ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు . మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో.. కట్టడాల , అనుమతులకు సంబంధించిన రికార్డుల్ని పరిశీన. వరుస ఫిర్యాదులతో ఏసీబీ దూకుడు.
అమరావతి,:ఏపీలో ఏసీబీ దూకుడు పెంచింది.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసుల్లో దాడులు  చేశారు. ఉదయం నుంచి వరుసగా సోదాలు  చేస్తున్నారు.. రికార్డుల్ని పరిశీలిస్తున్నారు. విజయనగరం, విశాఖ, కాకినాడ, గుంటూరు, ఒంగోు,నెల్లూరు  కడప, ప్రొద్దుటూరు మునిసిపల్‌ కార్పొరేషన్లలో దాడులు  చేశారు. మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో.. కట్టడాలు , అనుమతులకు సంబంధించిన రికార్డుల్ని పరిశీలించారు. కొన్ని ఆఫీసుల్లో నగదు సీజ్‌ చేసినట్లు తొస్తోంది.న్లెూరులో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ సోదాలు  నిర్వహించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా రికార్డును పరిశీలించామని.. ఒకవేళ ఏవైనా అవకతవకు ఉంటే ఉన్నతాధికారుకు నివేదిస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీస్‌ు, సిబ్బందిపై ఫిర్యాదులు  రావడంతో.. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు తెలు స్తోంది.కొన్నిచోట్ల అనుమతులు  లేకుండా నిర్మించిన భవనాల  విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు.. నిబంధనలకు విరుద్దంగా ప్లాన్‌ు ఓకే చేస్తున్నారని ఫిర్యాదు వచ్చాయట. అందుకే ఈ సోదాలు  చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ప్రజలు  అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు.. ఏపీ ప్రభుత్వం టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసింది.. దానికి కూడా ఫిర్యాదు అందినట్లు తొస్తోంది. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్‌ సైతం పాలనలో ఎక్కడా అవినీతి ఉండకూడదని.. ప్రజ సమస్యల్ని చిరునవ్వుతో పరిష్కరించాని చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు.. ఫిర్యాదు అందిన వెంటనే ఏసీబీని రంగంలోకి దించుతున్నారు.


కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు