మార్చి 29 నుంచి ఐపీఎల్‌.. ధోనీ చెన్నైకి ఎప్పుడు...

వ‌చ్చేనెల 29 నుంచి ఐపీఎల్ 2020 సీజ‌న్ ప్రారంభం కానుంది. ముంబైలో జ‌రిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ముంబై ఇండియ‌న్స్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నుంది.


ఈ ఏడాదికి సంబంధించి ఐపీఎల్ షెడ్యూల్ దాదాపు ఖ‌రారైన నేప‌థ్యంలో అన్ని జ‌ట్లు వ‌చ్చే సీజ‌న్ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో అందరి చూపు చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపైనే నెల‌కొని ఉంది. ఐపీఎల్‌ను ఉద్దేశించి గ‌తేడాది కంటే ముందుగానే ధోనీ త‌న క‌స‌ర‌త్తులు ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి 1 నుంచి ధోనీ.. చెన్నైలో సంద‌డి చేయనున్నాడ‌ని స‌మాచారం.గ‌తేడాది భార‌త్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓడిపోయాక ధోనీ మ‌ళ్లీ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడ‌లేదు. ఈక్ర‌మంలో ఈసారి ఐపీఎల్ కోసం ముందుగానే త‌న స‌న్నాహ‌కాల్ని ప్రారంభిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఐపీఎల్లో స‌త్తాచాటితే ఈ ఏడాది జ‌రిగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియాలోకి ధోనీ ఎంపిక‌య్యే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో అందిరి దృష్టి ధోనీపైనే నెల‌కొని ఉంది. మ‌రోవైపు ఐపీఎల్లో చెన్నైకి మంచి రికార్డు ఉంది. ధోనీ నాయ‌క‌త్తంలో మూడుసార్లు విజేత‌గా నిలిచింది. వ‌చ్చేనెల 29న ఆరంభ‌మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో చెన్నై ఆడనుంది.నిజానికి గ‌తేడాది మార్చి 15న ఐపీఎల్ ప్రాక్టీస్‌లోకి దిగిన ధోనీ.. ఈసారి రెండు వారాల‌ముందుగానే స‌న్నాహ‌కాలు ప్రారంభించ‌నున్నాడు. చెన్నై సొంత‌మైదానం చేపాక్ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేయ‌నున్నాడు. అత‌నితోపాటు సురేశ్ రైనా, అంబ‌టి తిరుప‌తి రాయుడు కూడా తోడుగా కసరత్తులు చేస్తారు. నిజానికి వీరు గ‌త మూడువారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ధోనీ రానున్న క్ర‌మంలో ప్ర‌స్తుతానికి విశ్రాంతి తీసుకుని, వ‌చ్చేనెల 1 నుంచి తిరిగి సన్నాహకాలుప్రారంభించాల‌ని యోచిస్తున్నారు.




కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు